
Ram Charan Peddi Movie: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది గురించి అభిమానులకు ఆందోళన ఎక్కువవుతోంది. దీనికి కారణం మరోసారి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతుండటమే. పెద్ద సినిమాకి ఒక్కసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాక, ఆ డేట్ కి సినిమా రిలీజ్ అవకపోతే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎలాంటి నెగిటివిటీ మొదలవుతుందో ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసిందే. గత ఏడాది అఖండ 2 రిలీజ్ కి కొన్ని గంటల ముందు వాయిదా పడితే ఏకంగా కలెక్షన్స్ మీదే గట్టి దెబ్బ పడింది. వరుస హిట్స్ మీద ఉన్న బాలయ్యకి ఫ్లాప్ తప్పలేదు.
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ కూడా ఎన్నోసార్లు విడుదల వాయిదా పడి సినిమాపై ఆసక్తి సన్నగిల్లిపోయింది. దాంతో, స్వయంగా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగినా, సినిమా డిజాస్టర్ పేరును మూటగట్టుకుంది. దానికి తోడు మారుతి తీయాలనుకున్నది ఒకటి, తీసింది ఒకటి కావడంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కి నిరాశ తప్పలేదు. ఇక, మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా ఏడాది నుంచి అప్పుడు, ఇప్పుడు అంటున్నారే తప్ప ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే, ఈ సినిమా అవుట్ పుట్ గురించి నెగిటివిటీ ఎక్కువైంది.

చరణ్ కి కూడా గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ చాలా అవసరం..
ఇప్పుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఇలాంటి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. వాస్తవానికి, మేకర్స్ చెప్పిన విడుదల తేదీ మార్చి 27. కానీ, ఆ డేట్ కి వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ 30న రిలీజ్ ఉంటుందని, స్వయంగా రామ్ చరణ్ కూడా ప్రకటించాడు. కానీ, ఇప్పుడు ఈ డేట్ కి సినిమా రిలీజ్ సాధ్యపడటం లేదు. లేకపోతే, ఈ పాటికే ముమ్మరంగా ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ మునిగి తేలుతూ ఉండేది. దర్శకుడు బుచ్చిబాబుకి ఈ సినిమా ఎంతో ప్రెస్టీజియష్. చరణ్ కి కూడా గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ చాలా అవసరం.
పెద్ది ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ చికిరి..చికిరి సాంగ్తో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సాంగ్ కూడా బాగానే అంచనాలను రేకెత్తించింది. కానీ, రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా, ఇప్పుడు అసలు సౌండే లేకపోవడంతో మెగా అభిమనులే కాదు, సినీ లవర్స్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా హడావిడిగా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ మీద చాలా తీవ్రంగా ప్రభావం పడటం మాత్రం గ్యారెంటీ. మరి, మేకర్స్ దీనిపై క్లారిటీ రిలీజ్ పోస్ట్ పోన్ గనక అయితే..మళ్ళీ రీ షెడ్యూల్ డేట్ ని ప్రకటిస్తే కాస్త ఫ్యాన్స్ లో గందరగోళం తగ్గుతుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో వృద్ది సినిమాస్ నిర్మిస్తోంది.





