రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఫస్ట్‌ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' ఫస్ట్‌ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!
Movie News

‘టైగర్‌ నాగేశ్వరరావు :  మాస్ మహరాజా రవితేజ నయా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు‘. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈమూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది.

మాస్ మహరాజా రవితేజ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది.

రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' ఫస్ట్‌ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!
RaviTeja

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ”ఏక్‌ ధమ్‌ ఏక్ ధమ్‌…” అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. పుల్ లిరికల్ సాంగ్ ను మంగళవారం రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీ సెప్టెంబరు 28న రిలీజ్ అవుతుందని ప్రకటించినా.. ఆరోజున ఖచ్చితంగా వస్తుందన్న సంకేతాలైతే లేవని టాక్ వస్తుంది . 70, 80 ద‌శ‌కాల్లో నాగేశ్వర‌రావు అనే గజదొంగ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు, దోపిడీలకు పాల్పడి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగేవాదంట . గ‌జ‌దొంగ క‌థ బ‌యోపిక్‌గా తెరకెక్కడంతో ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తర్వాత రవితేజ ‘ఈగల్’ అనే చిత్రంలో నటించనున్నాడు.