రూ.5799 కే రెడ్‌మీ 7ఎ స్మార్ట్‌ఫోన్

redmi 7a smartphone

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.5,799 ధరకు విక్రయిస్తుండగా, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.5,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే కేవలం ఈ నెలలో మాత్రమే ఈ ధరలకు ఈ రెండు వేరియెంట్లు లభిస్తాయి. వచ్చే నెల నుంచి ఈ రెండు వేరియెంట్లను వరుసగా రూ.5,999, రూ.6,199 ధరలకు విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్స్‌లో ఈ ఫోన్ ఈ నెల 11వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఈ ఫోన్‌పై 2 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు.

రెడ్‌మీ 7ఎ ఫీచర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.