కరోనా బారిన పడ్డ వారిలో మధుమేహం కేసులు

కరోనా బారిన పడ్డ వారిలో మధుమేహం కేసులు

శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ కారకాలు సమిష్టిగా టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు 432 గ్రాముల కార్బోహైడ్రేట్లను తింటారు. అయితే పట్టణ ప్రాంతాల ప్రజలు రోజుకు 347 గ్రాముల పిండి పదార్థాలను తీసుకుంటారు. ఇది నిపుణుల కమిటీ సిఫార్సు ప్రకారం… రోజుకు 282 గ్రాముల పిండి పదార్థాల కంటే ఎక్కువ. అన్నంలో అధిక స్థాయిలో పిండి పదార్థాలు, గ్లైసెమిక్ శాతం ఉండటంతో చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారిని అన్నం తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

చైనా తర్వాత ప్రపంచంలో అధిక సంఖ్యలో డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రజలు భారత్‌లోనే ఉన్నారు. 2019లో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ డేటా ప్రకారం…77 మిలియన్ల భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు. పైగా ఇటీవల కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువగా షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని ఓ సర్వే ద్వారా స్పష్టమైంది. దీంతో 60 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు కూడా భారీ సంఖ్యలో మధుమేహం వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల ప్రజలు రోజువారీ తీసుకునే ఆహారంలో వైట్ రైస్ బదులు ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవచ్చు.

డాలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ, క్యాబేజీ, బ్రౌన్ రైస్ అనేవి వైట్ రైస్‌కు దాలియా మంచి ఆకృతితో పాటు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీంతో కిచిడీ, ఉప్మా లేదా సూప్ తయారుచేసుకోవచ్చు. అరకప్పు డాలియా (గోధుమ రవ్వ)లో కేవలం 76 కేలరీలు ఉంటాయి. అరకప్పు తెల్ల బియ్యంతో పోల్చుకుంటే డాలియాలో దాదాపు 25 శాతం తక్కువ కేలరీలు ఉంటాయి. నీటితో ఉడకబెట్టుకుని వండుకోవడం ద్వారా వీటిలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B5,B6తో పాటు ఫైబర్ అందుతుంది.

బార్లీ రుచి దాదాపుగా ఓట్స్ తరహాలోనే ఉంటుంది. అరకప్పు బార్లీలో 91 గ్రాముల ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. బార్లీ అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది. B విటమిన్లు, జింక్, సెలీనియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, రాగి, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్ మొదలైన వాటిని గణనీయ శాతంలో అందిస్తుంది. బార్లీ కొలెస్టరాల్ స్థాయిని తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే బార్లీలో విటమిన్ ఇ, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గాయం నుంచి రక్షిస్తాయి. అందుకే బార్లీ తింటే మధుమేహం బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

వైట్ రైస్‌కు మరో అద్భుతమైన ప్రత్యామ్నాయం క్యాలీఫ్లవర్ రైస్. కాలీఫ్లవర్ అనేది విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కెలకు మంచి మూలం వంటిది. దాంతో ఇది శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. వండిన బియ్యంతో క్యాలీఫ్లవర్ తిన్నా కానీ మీకు అంతేస్థాయిలో పోషకాలు అందుతాయి. క్యాలీఫ్లవర్ రైస్‌ను సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌ను కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్ది నూనె వేసి అందులో మీడియం ఫ్లేమ్ మీద క్యాలీఫ్లవర్‌ను ఉడికించాలి. తరువాత అందులో ఉడికించిన అన్నం వేసి

క్యాబేజీ కూడా వైట్ రైస్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది. క్యాబేజీలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, ఐరన్, మెగ్నీషియం తక్కువ మొత్తంలో ఉంటాయి. క్యాబేజీ తురుము కూరను కూడా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా క్యాబేజీని కడిగి సన్నగా. తరువాత క్యాబేజీ మెత్తగా అయ్యేవరకు స్టవ్‌పై మీడియం మంట మీద కొద్దిగా నూనెతో ఉడికించాలి.

మీరు క్యాబేజీ తురుమును గుడ్లు లేదా మాంసంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.​వైట్ రైస్‌కు మరొక ప్రత్యామ్నాయం బ్రకోలీ. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన వెజిటబుల్. పోషకాలతో నిండిన ఈ వెజిటబుల్‌ను మీ ఆహారంలో వండుకుని తిన్నా లేదా పచ్చిగా తిన్నా ఆరోగ్యం అందుతుంది. బ్రకోలీని కూడా ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు. బ్రకోలీని తురిమిన తరువాత మీడియం మంటపై కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.

బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్‌ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయిశరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగా లేకుండా ఉన్న వైట్ రైస్ తిన్నందుకు ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి. ఉదాహరణకు మన ఇళ్లలో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల ముసలివారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు, వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు.

దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తోంది.పై పొరలో విటమిన్‌ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. వైట్ రైస్‌లో ఇది పూర్తిగా ఉండదు.లిసిధిన్‌ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్టరాల్‌ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుంది. వైట్ రైస్ తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు.

గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి వైట్ రైస్‌లో ఉండదుపీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, వైట్ రైస్‌లో పీచు పదార్థం లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు.వైట్ రైస్ తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ అన్నంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది.

అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతూ ఉంటాయి. నమలకపోతే నోటిలో గానీ, పొట్టలో గానీ జీర్ణక్రియ సరిగా ఉండదు.వైట్ రైస్‌కు రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలనిపించే విధంగా అందులో చప్పదనం ఉంటుంది.