హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ద్వి చక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో భార్య భర్తలతో పాటు కూతురు మృతి చెందింది.

దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.