తేజూను తప్పించి వరుణ్‌తో..!

Sai Dharam Tej Out Varun Tej In for Anil Ravipudi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు సక్సెస్‌ కోసం చాలా కష్ట పడుతున్నారు. వీరిద్దరిలో సాయి ధరమ్‌ తేజ్‌ రెండు మూడు కమర్షియల్‌ సక్సెస్‌లను దక్కించుకుని మాస్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. కాని వరుణ్‌ తేజ్‌ మాత్రం ఇప్పటి వరకు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ‘ఫిదా’ సినిమా మంచి వసూళ్లను రాబట్టినా కూడా పేరు అంతా కూడా సాయి పల్లవికే దక్కింది. వరుణ్‌ తేజ్‌కు అంతగా గుర్తింపు రాలేదు. ప్రత్యేకంగా వరుణ్‌కు అంటూ ఇప్పటి వరకు సక్సెస్‌ రాలేదు. అందుకే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు వరుణ్‌ తేజ్‌పై ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అనీల్‌ రావిపూడి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమా కోసం మొదట సాయి ధరమ్‌ తేజ్‌ను దర్శకుడు అనీల్‌ అనుకున్నాడు. ‘సుప్రీమ్‌’ చిత్రంతో అనీల్‌ మరియు సాయి ధరమ్‌ తేజ్‌లు కలిసి వర్క్‌ చేశారు. అందుకే మరోసారి సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి చేయాలని అనీల్‌ రావిపూడి భావించాడు. అందుకే మల్టీస్టారర్‌ చిత్రానికి సాయి ధరమ్‌ తేజ్‌ను ఓకే చేశాడు.

కథను తేజూ విని ఓకే అనడంతో మెగా ఫ్యామిలీకి కథ వినిపించడం జరిగింది. చిరంజీవి ఈ కథ వరుణ్‌ తేజ్‌కు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడట. మాస్‌ హీరోగా వరుణ్‌ ఎలివేట్‌ అవ్వాలి అంటే ఇలాంటి సినిమాను వరుణ్‌ చేయాలని భావించిన మెగా ఫ్యామిలీ తేజూను తప్పించి వరుణ్‌ను ఆ ప్రాజెక్ట్‌లో ఇరికించారు. దర్శకుడు అనీల్‌ రావిపూడి మరియు నిర్మాత దిల్‌రాజు కూడా ఓకే చెప్పారు. వరుణ్‌ తేజ్‌ మరియు వెంకటేష్‌ు కలిసి నటించబోతున్నారు. అతి త్వరలోనే చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఇదే సంవత్సరంలో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.