Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్, రంజిత్ పాల కాంబినేషన్లో ధనుష్ నిర్మించిన ‘కాలా’ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ చిత్రంను మొదట ఈనెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో అందుకు తగ్గట్లుగా ‘భరత్ అనే నేను’ మరియు ‘నా పేరు సూర్య’ చిత్రాల విడుదల తేదీలను మార్చుకున్నారు. అయితే తాజాగా ‘కాలా’ చిత్రంను జూన్కు వాయిదా వేయడం జరిగింది. దాంతో ఆ స్థానంలో మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున సాయి పల్లవి, నాగశౌర్య జంటగా తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ‘కణం’ విడుదల కాబోతుంది.
‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ‘కణం’ చిత్రం గత మూడు నెలలుగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఒక మంచి చిత్రాన్ని మంచి సమయంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ చిత్రంకు డేట్ను ఖరారు చేయడం జరిగింది. ‘కణం’ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయాలని నిర్ణయించారు. నిన్న విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తుంది. మొదటి వారం తర్వాత ఆ చిత్రం జోరు కాస్త తగ్గే అవకాశం ఉంది. దాంతో ఆచారి అమెరికా యాత్ర మరియు కణం చిత్రాలకు మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రేక్షకులను కణం చిత్రం మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.