ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు

ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు

ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం కివీ వీధుల్లో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీకర పోరాటం జరుగుతుంది. కాల్పులు, బాంబుల ప్రయోగాలతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో అమాయక జనం తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఓఖ్టిర్కాలో షెల్లింగ్ అనే నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడేళ్ల పాప కూడా ఉంది. షెల్లింగ్ నగరం కివీ నుంచి 345 కిలో మీటర్ల దూరంలో ఉంది.అదే విధంగా వేరే చోట జరిగిన దాడిలో మరో చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.

ఉక్రెయిన్‌లోని ఓడరేపు నగరమైన మారియుపోల్‌లో రష్యన్ బలగాలు చేసిన దాడిలో ఆరేళ్ల పాప, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. బాలికను కాపాడ్డానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. దీంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు బాలిక తండ్రి కూడా చావుబతుకుల మధ్య ఉన్నారు.

మరోవైపు రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అంగీకరించారు. బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ఫలించి భయానక పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశిస్తున్నారు. దాడులతో ఉక్రెయిన్‌ అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ చాలామంది ఉక్రెయిన్‌ను విడిచి పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. మరికొంతమంది అండర్ గ్రౌండ్స్‌లో తలదాచుకుంటున్నారు. అయితే తాగునీరు, తినడానికి తిండి అందక నానా అవస్థలు పడుతున్నారు.