మ్యాట్రిమోనీలో యువతి పై ఎస్సై వేధింపులు 

మ్యాట్రిమోనీలో యువతి పై ఎస్సై వేధింపులు 

పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్‌ పై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎస్సై రాజేష్ తనను మోసం చేశాడని వరంగల్ యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కొన్నాళ్ల క్రితం ఆ యువతికి మాట్రిమోనీ ద్వారా ఎస్సై పరిచయమయ్యాడు.  ఇద్దరూ తరచుగా ఫోన్  మాట్లాడుకున్నారు. ఒక రోజు తమ ఇంటికి వచ్చిన ఎస్సై తాను స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడని యువతి ఫిర్యాదుచేయడంతో రాజేష్ పై కేసు నమోదుచేశారు.