ఛార్మి, ముమైత్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు

sit giving special treatment for charmi and mumaith khan in drugs case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసులో పలువురు సినీ ప్రముఖులు నోటీసులు అందుకున్న నేపథ్యంలో వారి విచారణ జరుగుతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. నేడు యువ హీరో నవదీప్‌ను ప్రశ్నిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో టాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఛార్మి మరియు ముమైత్‌ ఖాన్‌లు కూడా ఉన్నారు. వీరిద్దరిని కూడా తమదైన శైలిలో విచారించేందుకు సిట్‌ బృందం సిద్దం అయ్యింది. వారిని అడిగేందుకు ప్రశ్నలను సిద్దం చేసింది. కాని వారిని విచారించేందుకు కాస్త ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని విచారించేందుకు మహిళ అధికారులను సిద్దం చేస్తున్నారు. ఆబ్కారీ శాఖలోనే ముగ్గురు మహిళ అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

మహిళ అధికారులతో పాటు వారిద్దరు ఎక్కడ అడిగితే అక్కడ విచారించేందుకు కూడా సిట్‌ ఓకే చెప్పింది. ఛార్మిని ఆమె అపార్ట్‌మెంట్‌లో ఇన్‌ కెమెరాలో విచారించే అవకాశం ఉంది. ఇక ముమైత్‌ను ఎక్కడ, ఎలా విచారిస్తారు అనే విషయంపై క్లారిటీ లేదు. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ఆమె ఖచ్చితంగా విచారణకు హాజరు అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇద్దరికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ముమైత్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకునేదని సిట్‌ అధికారులకు సమాచారం ఉంది. అయితే ఛార్మికి డ్రగ్స్‌ అలవాటు ఉండటంతో పాటు ఆమె డ్రగ్స్‌ను సినీ తారలకు మరియు ఈవెంట్స్‌లలో ప్రముఖుల పిల్లలకు సరఫరా చేస్తుందనే అనుమానాలు సిట్‌ వ్యక్తం చేస్తుంది. విచారణలో ఆ విషయాలన్ని నిగ్గు తేల్చేందుకు సిట్‌ సిద్దం అయ్యింది. మరి వారు విచారణకు సహకరిస్తారా అనేది చూడాలి. ఇప్పటి ఛార్మి విచారణను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ఆమెకు సానుకూల నిర్ణయం రావడం అనేది అనుమనామే. సో ఛార్మి విచారణకు హాజరు కావాల్సిందే, డ్రగ్స్‌ తీసుకున్నారా లేదా అని తేల్చేందుకు శాంపిల్స్‌ కూడా ఇవ్వాల్సిందే అని సిట్‌ అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు

మేడం మీకు అంత సీన్‌ లేదు