విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్లు

విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్లు

విమానయాన సంస్థ గో ఫస్ట్ తీపికబురు అందించింది. ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్ సందర్భంగా ప్రయాణికులకు అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. గోవా, మాల్దీవులకు ఉచితంగా వెళ్లే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు.

ఆగస్ట్ 15న, ఆగస్ట్ 22న విమాన ప్రయాణం చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ కాలంలో విమాన ప్రయాణం చేసిన వారికి విమానంలో గిఫ్ట్‌లు కూడా అందజేస్తారు. ఆగస్ట్ 15న విమాన ప్రయాణం చేస్తే.. గోవా వెళ్లే ఛాన్స్ పొందొచ్చు. ఇద్దరు కపుల్స్‌కు ఇది వర్తిస్తుంది.

గోవాలో మూడు రోజులు ఉండొచ్చు. వచ్చే పోయే విమాన టికెట్లు కంపెనీనే పెట్టుకుంటుంది. ఫుడ్ ఖర్చులను కూడా గో ఫస్ట్ భరిస్తుంది. అలాగే ఆగస్ట్ 22న జర్నీ చేసిన వారు మాల్దీవులు వెళ్లే ఛాన్స్ పొందొచ్చు. ఇద్దరు కపుల్స్‌కు ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

మాల్దీవులకు వెళ్లే వారికి ఇంటర్నేషనల్ సిమ్ కార్డు కూడా అందిస్తారు. ఇంట్లో వారితో దీని ద్వారా మాట్లాడుకోవచ్చు. ఈ ట్రిప్ 4 రోజులు ఉంటుంది. 75వ ఇండిపెండెన్స్ డే, రక్షా బంధన్ వంటి వాటిని పురస్కరించుకొని కంపెనీ ఇలాంటి ఆఫర్ తీసుకువచ్చింది.