శ్రీనువైట్ల పారితోషికం తీసుకోకుండా..!

srinu vaitla amar akbar anthony

వరుసగా నాలుగు అట్టర్‌ ఫ్లాప్‌లు పడ్డా కూడా దర్శకుడు శ్రీనువైట్లకు అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. మైత్రి మూవీ మేకర్స్‌ శ్రీనువైట్లను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. రవితేజ మరియు ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసగా ఫ్లాప్‌లు చవిచూసిన కారణంగా శ్రీనువైట్ల ఈ చిత్రానికి పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా సక్సెస్‌ అయితే నిర్మాతల నుండి లాభాల్లో షేర్‌ను తీసుకుంటాడట. భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌ అవ్వడం, లాభాలు దక్కించుకోవడం అనేది కష్టమైన విషయమై అని, అయినా కూడా శ్రీనువైట్ల చాలా నమ్మకంతో ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.

శ్రీనువైట్ల పారితోషికం తీసుకోకుండా..! - Telugu Bullet

రవితేజ మరియు శ్రీనువైట్లకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా అవసరం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా రీ ఎంట్రీ ఇస్తున్న కారణంగా అందరికి ఆసక్తి ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈనెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రంతో శ్రీనువైట్ల కెరీర్‌ ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయితే కెరీర్‌ పరంగా శ్రీనువైట్ల ఇక ఫుల్‌స్టాప్‌ పడ్డట్లే అంటున్నారు. రవితేజ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి వారిద్దరికి ఈ చిత్రం ఎలాంటి పలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇలియానా కూడా రీఎంట్రీతో సక్సెస్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి.