మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ Peddi ట్రైలర్ తాజాగా సంచలనంగా మారింది. ఈ ట్రైలర్ను చూసిన మెగాస్టార్ Chiranjeevi తన ఆనందాన్ని దాచుకోలేక ఎక్స్ వేదికగా స్పందించారు. మాస్ మ్యాడ్నెస్, ఎమోషన్, ఎలివేషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని, ట్రైలర్ పూర్తిగా అంచనాలకు మించి ఉందని ప్రశంసలు కురిపించారు. చరణ్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు A. R. Rahman తమ బెస్ట్ ఇచ్చారని కొనియాడారు.
ఇక చిరు అంటే లీకుల సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే జరిగింది. ట్రైలర్ చూసి బాగా ఇంప్రెస్ అయిన మెగాస్టార్, అందులోని ఓ పవర్ఫుల్ డైలాగ్ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు.
“మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలవనుందని చిరు స్పష్టం చేశారు. ఈ డైలాగ్ లీక్తోనే మెగా ఫ్యాన్స్లో హై వోల్టేజ్ పూనకాలు మొదలయ్యాయి ⚡
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ భారీ ట్రైలర్ను మే 18న ముంబైలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాపై చిరంజీవి రివ్యూ, డైలాగ్ లీక్తో హైప్ మరింత రెట్టింపు అయింది. Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
