బెంగళూరు మహా నగరంలో నమోదయిన విచిత్రమయిన కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం కుమార్, జాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే సంస్థలో సూపర్వైజర్లగా పని చేస్తున్నారు. రెండేళ్ల నుంచి వీరు స్నేహితులు. ఈక్రమంలో కుమార్ భార్యతో జాన్ వివాహేతఃర బంధం ఏర్పరచుకున్నాడు. అయితే కొంతకాలంగా జాన్, కుమార్ మద్య విభేదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఈ నెల 24న కుమార్ ఇంటికి వచ్చిన జాన్ బరువు తగ్గేందుకంటూ మత్తు మందు కలిపిన ఔషధాన్ని కుమార్ భార్యతో తాగించాడు. ఆమె సో్పృహ కోల్పోగానే 11 నెలల చిన్నారిని జాన్ అపహరించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్.. బాలుడు కనిపించకపోగా భార్యను ఆరా తీశాడు. జాన్ ఇచ్చిన ఔషధాన్ని తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొంది. దీంతో కుమార్ కామాక్షిపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు జాన్ను అరెస్ట్ చేశారు. అయితే కుమార్ భార్యతో తనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డ తన బిడ్డేనని అందుకే ఆ బిడ్డ తనకే కావాలి జాన్ వాదించాడు. అయితే ఆ పసికందు తనబిడ్డనే అని కుమార్ చెబుతున్దద్మ్త్ ఏమి చేయాలో తెలీని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇక చివరికి ఉన్నత అధికారులతో చర్చించి న్యాయ సలహా తీసుకొని ఆ చిన్నారి రక్తశ్యాంపుల్స్ను డీఎన్ఏ పరీక్షలకు పంపాలని పోలీసులు నిర్ణయించారు.