పెళ్లి చేసి పెళ్లి కూతురినే లేపుకెళ్ళిన పూజారి

The priest who raised the bride's bride was married

పెళ్లిచేసిన పురోహితుడే పెళ్లి కూతురును లేపుకెళ్లిన సినీ ఫక్కీ ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో  వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లోని విదిష జిల్లా సిరోంజ్ లోని బాగ్రడ్‌ గ్రామంలో వినోద్ మహరాజ్ అనే పురోహితుడు ఈ నెల 7న ఒక పెళ్లి జరిపించాడు. వివాహం తర్వాత ఆ యువతి అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకుంది. అయితే తిరిగి అత్తారింటికి వెళ్ళలేదు. దీంతో అందరూ ఆమె జాడ కోసం వెతుకుతుండగా, పెళ్లి జరిపించిన పంతులు కూడా కొద్ది రోజులుగా ఊళ్లోంచి మాయం అయినట్లు గమనించారు. దీంతో లబోదిబోమన్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేయగా పెళ్లి జరిపించిన పురోహితుడు వినోద్‌ అలాగే వధువు  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని దీంతో పథకం ప్రకారమే పెళ్లి అయ్యాక పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే యువతి తనతో పాటు లక్షన్నర రూపాయల బంగారు నగలతో పాటు, 30 వేల నగదు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి జాడ కోసం వెతుకుతున్నారు. అయితే సదరు పురోహితుడు వినోద్‌కు గతంలోనే వివాహమవగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయినా ప్రేమ పేరుతో కొత్త పెళ్లి కూతురిని లేపుకెళ్ళాడు ఆ నిత్య పెళ్లి కొడుకు అలియాస్ పెళ్ళిళ్ళ పంతులు.