లిక్కర్ గోడౌన్ లో ఎలుకలు.. ఏకంగా తాగేస్తున్నాయ్…

ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు షాకింగ్ కు గురయ్యారు. అదేమంటే.. ఏకంగా ఆ ఊర్లో ఎలుకలు లిక్కర్ తాగేస్తున్నాయట.. ఎక్సైజ్ అధికారులకే దిమ్మ తిరిగింది. లిక్కర్ స్టాక్‌లో ఎందుకు తేడా వచ్చింది ఎక్సైజ్ అధికారులకు షాపు నిర్వాహకుల్ని ఆరా తీస్తే ఇదే సమాధానం రావడం చాలా వింతగా అనిపిస్తుంది. ఈ సమాధానంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే గత రెండు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లాలోని ఓ మద్యం షాపులో లిక్కర్‌ ఎలుకలు తాగేశాయి అనేది. లిక్కర్ స్టాక్‌లో ఎందుకు తేడా వచ్చింది.. ఎక్సైజ్ అధికారులకు షాపు నిర్వాహకుల్ని ఆరా తీస్తే ఇదే సమాధానం వచ్చిందట. ఈ సమాధానంతో అధికారులకు దిమ్మ తిరిగిందని టాక్. అద్దంకిలోని ఓ మద్యం షాపులో ఈ వ్యవహారం బయటపడింది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా అసలు ఎలుకల వల్ల మద్యం బాటిళ్లు ఖాళీ కావడం ఏంటి? అనేది ఆరా తీస్తున్నారు. అద్దంకి సర్కిల్‌‌లో ఉన్న 30 షాపుల్లో 13 చోట్ల స్టాక్ తేడా ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మద్యం బాటిళ్లను లిక్కర్ షాపులు నిర్వహించే వ్యక్తులే మాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. షాపుల్లో స్టాక్ ఇళ్ల‌కు త‌ర‌లించి.. డిమాండ్ ఉండటంతో ఎక్కువ రేట్ల‌కు అమ్ముకుని ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఈ లిక్కర్ స్టాక్ అంశాన్ని ఎక్సైజ్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నిర్వాహకులను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడిస్తున్నారు. లిక్క‌ర్ స్టాక్ విష‌యంలో తేడా జరిగిన మాట వాస్తవమేనని.. ఈ ఘటనపై విచారణ జరుపుతామని.. త్వరలోనే నిజాలు బయటపెడతామని అధికారులు వివరిస్తున్నారు.