50 పిల్లపాములను చంపి… తల్లి పామును విడిచిన మహిళ… ఆపై భయం…!

తెలంగాణలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమంటే.. ఓ మహిళ ఏకంగా ఒకేసారి 50 పాములను చంపేసింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లో ఉండటంతో జంతువులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. చివరికి పులులు కూడా జనావాసాల్లోకి వస్తూ.. స్వేచ్ఛగా.. చక్కర్లు కొడుతున్నాయి. ఇక పాములైతే ఏకంగా ఇళ్లల్లోకే చొరబడిపోతున్నాయి.

అయితే కొందరు పాము కాటుకు గురై ఆస్పత్రిపాలవుతున్నారు. సహజంగా ఒక్క పామును చూస్తేనే మనం భయపడిపోతుంటాం. అలాంటిది ఏకంగా పదుల సంఖ్యలో పాములు ఒకే చోట కనిపిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన కొంక లచ్చల్‌, భార్య స్వరూపతో కలిసి ఇంటి వద్ద ఉన్న బండ రాళ్లను తొలగిస్తున్నారు. అందులోంచి పదుల సంఖ్యలో పాము పిల్లలు భయటపడ్డాయి. ఆ పాములను చూడగానే ఆ దంపతులు షాక్ అయ్యారు. స్వరూపా వెంటనే కర్ర తీసుకొచ్చి వాటిని వెంటాడి మరీ చంపేసింది. సుమారు 50 పాములను చంపేసింది.

అవన్నీ తాచు పాము పిల్లలని ఆ దంపతులు వెల్లడించారు. అవి కరిస్తే అంతే. అయితే.. వాటిల్లోంచి తల్లి పాము కనిపించక పోవడంతో చాలా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ దంపతులు. తల్లి పాము కసిపెంచుకుంటే పరిస్థితి ఏంటి అనేది తెలియక అయోమయంలో పడిపోయారు.