ప్రవాస భారతీయుడుకి నోబెల్ బహుమతి

ప్రవాస భారతీయుడుకి నోబెల్ బహుమతి

అమర్థ్యాసేన్‌ తర్వాత నోబెల్‌ పొందిన భారతీయుడిగా అభిజిత్‌ బెనెర్జీ ఘనత సాదించారు.అమెరికాలోని మసాచూసెట్స్‌యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న అభిజిత్‌ బెనెర్జీ ఆర్థికశాస్త్రంలో హార్వార్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

ఆర్థికశాస్త్రంలో విశేష సేవలని అందించినందుకు ఈ ఏడాదికి ముగ్గురికి నోబెల్ బహుమతి అందనుంది. రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఎంపిక చేసిన ముగ్గురిలో భారత్ నుండి అభిజిత్‌ బెనర్జీ ఉన్నాడు. ఇంకా పారిస్ కి చెందిన ఎస్తేర్‌ డుఫ్లో, అమెరికాకి చెందిన మైఖేల్‌ క్రెమేర్‌లు సంయుక్తంగా ఈ బహుమతికి ఎంపిక అయ్యారు.

రెండు దశాబ్దాలగా ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి వీరు ముగ్గురు చేసిన రూపకల్పనకి ఈ బహుమతి వరించింది. ప్రపంచ పేదరికంతో పోరాడే సామర్థ్యాన్ని  వీరి ప్రయోగాత్మక విధానం పెంచింది అని రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ తెలిపింది. ప్రైజ్‌మనీగా 9మిలియన్ల డాలర్లను నోబెల్‌ కమిటీ నుండి ఈ ముగ్గురు అందుకొనున్నారు.