TSRTC: కార్తిక మాసం స్పెషల్.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

TS Politics: Telangana RTC gives good news to male passengers
TS Politics: Telangana RTC gives good news to male passengers

తెలంగాణ ప్రజలకు కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు భక్తుల కోసం ఓ స్పెషల్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. భక్తులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో కార్తికమాసం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్న ప్రధాన శైవక్షేత్రాలు ఇవే..

తెలంగాణ: వెయ్యి స్తంభాల గుడి, వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, పాలకుర్తి తదితర దక్కన్‌ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయన్నారు. టిక్కెట్‌ ఛార్జీలు ఎక్స్‌ప్రెస్‌ రూ.1500, సూపర్‌లగ్జరీ రూ.1900, రాజధాని రూ.2400గా నిర్ణయించామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌: ద్రాక్షారామం, అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని తెలిపారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.4 వేలు, సూపర్‌లగ్జరీ రూ.3200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.