మహేష్‌ 25 సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు

Uttarakhand CM meets Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ తాజాగా ప్రారంభం అయ్యింది. గత మూడు నాలుగు నెలలుగా మహేష్‌ 25వ చిత్రం ఎప్పుడు ఎప్పుడు అంటూ చర్చ జరుగుతుంది. అది ఇన్నాళ్లకు తెర రూపం దాల్చబోతుంది. డెహ్రాడూన్‌లో మహేష్‌ 25వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిందని, గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. గత రెండు మూడు రోజులుగా అక్కడ షూటింగ్‌ జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమద్య డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ కాన్సిల్‌ అయ్యిందని, యోగా డే సందర్బంగా సినిమాను వాయిదా వేశారు అంటూ వార్తలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన వాయిదా వార్తలు పుకార్లే అని తేలిపోయింది. అంతా అనుకుంటున్నట్లుగా మహేష్‌బాబు సినిమా మళ్లీ వాయిదా పడలేదని తాజాగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయిన ఒక ఫొటోతో వెళ్లడి అయ్యింది. చాలా కాలంగా మహేష్‌బాబు సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కాని తాజాగా డెహ్రాడూన్‌లో స్థానిక సీఎంతో కలిసి సరదాగా పిచ్చాపాటి మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. షూటింగ్‌ విరామం సమయంలో సీఎంను మహేష్‌బాబు అండ్‌ టీం కలిసినట్లుగా తెలుస్తోంది. భరత్‌ అనే నేను చిత్రం తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఇంత కాలం పూర్తి షేవ్‌తో, నీట్‌గా కనిపించిన మహేష్‌బాబు మొదటి సారి మీసాలు, గడ్డం పెంచి కనిపించబోతున్నాడు. ఇప్పటికే మీసాల లుక్ రివీల్‌ అయ్యింది. త్వరలోనే మహేష్‌బాబు సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.