చరణ్‌తో వరుణ్‌ ఢీ

varun-tej-competing-with-ram-charan

మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌ మరియు కళ్యాణ్‌ దేవ్‌ల చిత్రాలు ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ మరియు ‘విజేత’ ఒకే రోజు విడుదల చేయడానికి నిర్మాతలు సిద్దం అయ్యారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవితో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్‌ ఆయా నిర్మాతలతో మాట్లాడి కనీసం గ్యాప్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. మెగా హీరోల చిత్రాలు ఎప్పుడు కూడా ఒకే రోజు వచ్చేలా ఉండవద్దనేది మెగా కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే త్వరలో సంక్రాంతికి మెగా బ్రదర్స్‌ రామ్‌ చరణ్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు ఢీ కొట్టబోతున్నారు. వీరిద్దరు కూడా కేవలం ఒకటి లేదా రెండు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి మూవీని వచ్చే ఏడాది అంటే 2018 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత చరణ్‌ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గకుండా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దానయ్య కూడా ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ సమయంలోనే దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఎఫ్‌ 2’ను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో దిల్‌రాజు మల్టీస్టారర్‌ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే ఈసారి కూడా మరో విజయాన్ని దక్కించుకునేందుకు దిల్‌రాజు సంక్రాంతికి రాబోతున్నాడు. ఈ మెగా బ్రదర్స్‌తో పాటు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.