ప్రియుడితో లేచిపోయిన భార్య కరోనాతో ఇంటికి.. ఆపై హత్య

కరోనా వైరస్ భయం కొన్ని జంటలను కులుపుతుంది. కరోనా కారణంగా వచ్చే కొంత భయం కొన్ని ఆవేశాలను.. కొన్ని అనర్థాలకు దారితీస్తుంది. కరెక్టుగా పదేళ్ల క్రితం.. కట్టుకున్నోడిని కాదని ఉంచుకున్నోడితో పరారైన ఓ భార్య.. కరోనా వైరస్ భయంతో స్వగ్రామానికి తిరిగి వచ్చి బంధువుల చేతిలో హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని మధురై జిల్లాలోని ఓగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకొన్న భార్య.. అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడుతో పరారైంది. భర్త, ఇద్దరు పిల్లలుండీ చక్కగా సంసారం చేసుకోకుండా మరో యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుంది ఓ వివాహిత. భర్త కళ్లుగప్పి కొన్నాళ్లపాటు గుట్టుగా సాగిన వీరి వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తనకు భర్త వద్దంటూ ప్రియుడితో కలిసి పరారైంది. పదేళ్లుగా ఎవరి కంటా పడకుండా సహజీవనం చేస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్ సందర్భంగా సొంతూరికి ప్రియుడితో కలిసి తిరిగొచ్చింది. వెంటనే ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఆవేశం ఆపుకోలేక ఇద్దరినీ దారుణంగా చితకకొట్టారు. దాంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.