అత్తతో ‘ఆ’ బంధం…నరికి చంపిన మేనమామ…!

Wife Illegal Affair With Uncle

వివాహేతర సంబంధాలు వావీ వరుసలు లేకుండా పోతున్నాయి. ఒక వ్యక్తి తనకు అత్త వరసయ్యే మహిళతో పెట్టుకున్న వివాహేతర బంధం అతని ప్రాణాలను తీసింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నారా యణపురం శివారు కొత్తతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం కొత్తతండాకు చెందిన బానోత్‌ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు కు పదేళ్లక్రితం ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నా డు. అయితే వరుసకు అత్త అయ్యే ఆమెతో లింగన్నకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిజానికి భద్రు సొంత అక్క బిడ్డ సేవిరిని మొదట వివాహం చేసుకోగా వారికి పడక విడాకులయ్యాయి. రెండో వివాహం చేసుకోగా భార్య సరోజ ముగ్గురు కొడుకులు జన్మించాక మృతిచెందింది. ఆ తర్వాత నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. అతడి మేనల్లుడు మాలోత్‌ లింగన్న కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

axe

ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా మార్పు లేకపోవడంతో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రూ.10వేల జరిమానా విధించారు. ఆ తర్వాత వారం రోజులకే నాగమణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు అక్కడా లేదని మేనల్లుడు లింగన్న, నాగమణి మరో చోట సహజీవనం చేస్తున్నారని లింగన్నపై భద్రు పగపెంచుకున్నాడు. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్‌ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్‌పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్‌పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

man-dead