World Cup 2023 : విరాట్‌ కోహ్లీ పరువు తీసిన శ్రీలంక కెప్టెన్..!

World Cup 2023: Virat Kohli's defamed Sri Lankan captain..!
World Cup 2023: Virat Kohli's defamed Sri Lankan captain..!

విరాట్‌ కోహ్లీ పరువు తీశాడు శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండీస్. దీనితో శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండీస్ పై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. విరాట్ కోహ్లీ 49 సెంచరీలతో సచిన్ రికార్డుని సమం చేసిన్నారని మీరు అభినందించాలని అనుకుంటున్నారా? అని విలేకరులు అతడిని ప్రశ్నించారు. దీనికి ‘నేనెందుకు కోహ్లీని అభినందించాలి?’ అంటూ నవ్వుతూ బదిలిచ్చారు. దీనితో కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, ప్రపంచ కప్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో భారత్ 243 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 327 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు 83 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టారు. శమి, కుల్దీప్ చరో 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.