చైతూ, అల్లరిల్లో ఎవరిది పై చేయి?

naga chaitanya Allari Naresh Abbayi Box office war

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సినిమాల సందడి కొనసాగుతుంది. ‘ఫిదా’, ‘అర్జున్‌ రెడ్డి’ తాజాగా ‘పైసా వసూల్‌’ చిత్రాలు వరుసగా సక్సెస్‌ అవుతూ వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. ఫిదా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాస్త తగ్గింది. అర్జున్‌ రెడ్డి సందడి భారీగానే ఉంది. బాలయ్య కూడా తన స్థాయిలో దుమ్ము లేపుతున్నాడు. ఇక ఈ వారంలో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడేందుకు రెండు సినిమాలు సిద్దం అయ్యాయి. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘యుద్దం శరణం’, అల్లరి నరేష్‌ నటించిన ‘మేడ మీద అబ్బాయి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లో నాగచైతన్య ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో మొదటి సారి శ్రీకాంత్‌ పూర్తి స్థాయి విలన్‌గా నటించాడు. లావణ్య త్రిపాఠి గ్లామర్‌ ఈ సినిమాకు హైలైట్‌ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు అల్లరోడి ‘మేడ మీద అబ్బాయి’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అవుతుంది. చాలా నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సినిమా అవ్వడంతో సినీ వర్గాల్లో కూడా పెద్దగా ఆసక్తి లేదు. అయితే విడుదలకు ముందు కామెడీ టీజర్‌లు మరియు ప్రమోషన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారే చూడాలి. ఈ రెండు చిత్రాల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు:

చైతూకు రాఖీ కడతానన్న సమంత!

అర్జున్‌ రెడ్డి శాటిలైట్‌ కష్టాలు

పవన్‌ మళ్లీ తండ్రి కాబోతున్నాడు!