క్షమాపణలు చెప్పిన ధనుష్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ స్టార్‌ హీరో ఇటీవల ‘వీఐపీ 2’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీవీ9 ఇంటర్వ్యూ మద్యలో మైక్‌ పీకి పారేసి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. సుచిలీక్స్‌ టాపిక్‌ రాగానే ధనుష్‌ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. యాంకర్‌ దీప్తిపై అసహనంతో షూట్‌ మద్యలో లేచి పోయిన విషయం తెల్సిందే. ఆ విషయం హాట్‌ టాపిక్‌ అయ్యింది. కాస్త మెల్లగా ఆ విషయాలను వదిలేయండి అంటూ ధనుష్‌ చెప్తే సరిపోయేది. కాని ఆయన ప్రవర్తించిన తీరు ఆయన తీరును బయట పెట్టింది. తమిళ హీరో తెలుగు రాష్ట్రంలో, తెలుగు మీడియాపై అలా ప్రవర్తించడంతో ఆయన తీరును అంతా తప్పుబట్టారు. దాంతో ధనుష్‌ దిగిరాక తప్పలేదు. 

తాజాగా ధనుష్‌ తాను అలా చేసి ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ క్షణంలో కాస్త సంయమనం పాటించి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదు. కాని ఆ క్షణంలో తాను మరేం ఆలోచించలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టీవీ9 వారికి మరియు సదరు యాంకర్‌కు ధనుష్‌ క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు ఆ ఇష్యూను ఎక్కువ సీరియస్‌ చేయలేదు. తాజాగా ధనుష్‌ స్వయంగా తాను అలా చేసి ఉండకూడదు అంటూ పశ్చాతాప పడుతూ వ్యాఖ్యలు చేశాడు. త్వరలో ‘వీఐపీ 2’ చిత్రం విడుదల కానుంది. అందుకే ధనుష్‌ ఇలా క్షమాపణలు చెప్పాడని కొందరు అంటున్నారు. ఎలాగో అలా అయితే క్షమాపణలు చెప్పాడు కదా, ఈ విషయాన్ని వదిలేస్తే బెటర్‌ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.