భూసర్వే కోసమే సిట్టింగుల మంత్రం

telangana-cm-kcr-holds-trslp-meeting-over-land-survey

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేసీఆర్ కు సమకాలీన రాజకీయాల్లో ఉన్న లౌక్యం మరో నేతకు లేదు. తమ పార్టీ నేతల్ని ఎప్పుడు ఎలా బుట్టలో వేయాలో ఆయనకు బాగా తెలుసు. మొన్నటివరకు పనితీరు ఆధారంగా టికెట్లని ఊదరకొట్టిన గులాబీ బాస్..సడెన్ గా సిట్టింగులందరికీ సీట్లిస్తామని హామీ ఇచ్చారు. అదీ భూసర్వే అవగాహన కోసం పెట్టిన మీటింగులో చెప్పడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశమైంది.

భూసర్వే పక్కాగా జరగాలంటే.. అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉత్సాహంగా లేకపోతే అధికారులు సరిగా పనిచేయరు. అందుకే భూసర్వే పూర్తయ్యేదాకా సిట్టింగుల్ని అధే భ్రమలో ఉంచాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. అందుకే సిట్టింగుల మంత్రం జపించి భూసర్వేను విజయవంతం చేయాలని ఆలోచిస్తున్నారు.

కేసీఆర్ సంగతి తెలియని ఎమ్మెల్యేలు మాత్రం తమకు సీట్లు ఖాయమయ్యాయని పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు సీనియర్లు మాత్రం కేసీఆర్ తీరు గ్రహించి సైలంటుగా ఉన్నారు. భూసర్వేలో తమ చేతివాటం చూపిస్తామని అనుకుంటున్నారట. ఇంత గందరగోళం మధ్య జరుగుతున్న భూసర్వే ఎలాంటి ఫలితాలు ఇస్తుందోనని కేసీఆర్ కు కూడా టెన్షన్ ఉందట.

మరిన్ని వార్తలు:

లాలూ ర్యాలీలో ఆజాద్‌, మ‌మ‌త‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌గ‌న్ ను డేరాబాబాతో పోల్చిన చంద్ర‌బాబు