బీజేపీపై ఎంత బురద జల్లితే అంత కమలం వికసిస్తుంది

ఎంత బురద జల్లితే అంత కమలం వికసిస్తుంది
మీరు బీజేపీపై బురద జల్లుతున్నారు

గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్షాలను టార్గెట్ చేస్తూ.. బీజేపీని ఎంత టార్గెట్ చేస్తే అంత కమలం వికసిస్తుందని అన్నారు.’ఈ ఎంపీలకు (ప్రతిపక్ష ఎంపీలకు) నేను చెప్పాలనుకుంటున్నాను.. మీరు ఎంతగా ‘కీచడ్ (బురద)’ వేస్తే అంత బాగా కమలం వికసిస్తుందని’ ప్రధాని మోదీ అన్నారు.గత మూడు, నాలుగేళ్లలో 11 కోట్ల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు లభించాయని, తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా 48 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించామని ప్రధాని మోదీ చెప్పారు.

ప్రధాని మాట్లాడుతున్న సమయంలోనే ప్రతిపక్ష ఎంపీలు అదానీ, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అదానీ కేసులో జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని… ప్రభుత్వం దేనికీ భయపడనప్పుడు జేపీసీని ఏర్పాటు చేయాలని ఖర్గే అన్నారు.