పేదవారికి నిత్యావసర వస్తువులని అందిస్తున్న రకుల్ ప్రీత్

పేదవారికి నిత్యావసర వస్తువులని అందిస్తున్న రకుల్ ప్రీత్

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది పేదవారు, రోజూ వారి కూలీలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే ఇందుకోసం గాను చాల మంది వ్యాపారవేత్తలు, చిత్ర ప్రముఖులు, సామాజిక వేత్తలు ఆర్ధికంగా, మరియు సామాజికంగా వారికి అండగా నిలబడుతున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ తన వంతు బాధ్యతగా ఓ కార్యక్రమం చేస్తున్నారు. గుర్గావ్ నందు కల ఓ స్లమ్ లో ప్రజలు నిత్యావసర సరుకు కొనలేక ఇబ్బంది పడుతున్నారు . వీరికి లాక్ డౌన్ వరకు రెండు పూటలా భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారట. ఒక వేళ లాక్ డౌన్ పొడిగిస్తే అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించునుకున్నారట.