గతేడాది విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన శంబాల తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్తో మరో ఆసక్తికర ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచింది.
అడవికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోరాటం నేపథ్యంగా ఈ సినిమా అడ్వెంచర్ టచ్తో సాగనుందని టీమ్ హింట్ ఇచ్చింది. తాజాగా సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో కనిపించే ఓ బిడ్డ, ఖడ్గం, సింహం… ఇవన్నీ కలిసి ఇది ఫారెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా అని స్పష్టంగా చెబుతున్నాయి.

‘ఏ లెజెండ్ ఈజ్ బార్న్’ అనే పవర్ఫుల్ ట్యాగ్లైన్తో వచ్చిన ఈ పోస్టర్ ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్ట్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై హైప్ను మరింత పెంచుతోంది.
