దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది (PEDDI) ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు రేంజ్లో జరిగినట్లు సమాచారం.
ఇక ఆసక్తికరమైన అంశం నార్త్ ఇండియా మార్కెట్. అక్కడ ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ భారీగా రిలీజ్ చేస్తోంది. జూన్ 5న వరుణ్ ధావన్ నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై తప్ప హిందీలో పెద్ద పోటీ చిత్రాలు లేకపోవడం ‘పెద్ది’కి కలిసి వచ్చే అంశం. పాజిటివ్ టాక్ వస్తే చాలు, హిందీ బెల్ట్లో ఈ సినిమా సంచలనం సృష్టించే ఛాన్స్ ఉందన్నది ట్రేడ్ వర్గాల మాట.
అంతేకాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సమయంలో పెద్ద రిలీజులు లేకపోవడం ‘పెద్ది’కి మరింత ప్లస్గా మారింది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చిత్ర యూనిట్ ప్రమోషన్లను గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది. ప్రధాన నగరాల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ స్వయంగా పాల్గొని సినిమాను ప్రచారం చేయనున్నారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, తన వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 4న పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఏ స్థాయి శబ్దం చేస్తుందో చూడాలి.
