దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చంతా దళపతి విజయ్ సాధించిన భారీ రాజకీయ విజయంపైనే సాగుతోంది. తొలి ఎన్నికల్లోనే విజయ్ సత్తా చాటుతూ, తమిళనాట రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. పెరంబూరు మరియు తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన విజయం సాధించడం పెద్ద సంచలనంగా మారింది. అయితే తిరుచ్చి ఈస్ట్ సీటుకు విజయ్ రాజీనామా చేయడం అనూహ్యంగా మారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. విజయ్ రాజీనామా చేసిన స్థానంలోకి హీరోయిన్ త్రిష ఎంట్రీ ఇవ్వనున్నారన్న క్రేజీ రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా విజయ్–త్రిషలపై వస్తున్న వార్తలు, విజయ్ గెలుపు తర్వాత మరింత ఊపందుకోవడంతో ఈ టాక్ మరింత షాక్గా మారింది.
అయితే మరోవైపు భిన్నమైన కథనం కూడా వినిపిస్తోంది. విజయ్ రాజీనామా చేసిన సీటు నుంచి త్రిష కాకుండా విజయ్ తండ్రి పోటీ చేయవచ్చన్న వెర్షన్ చక్కర్లు కొడుతోంది. దీంతో అసలు ఆ స్థానానికి ఎవరు బరిలో దిగుతారు? లేక త్రిష ఎంట్రీపై వస్తున్న వార్తలు కేవలం గాసిప్సేనా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ వర్గాలు, అభిమానులు అందరూ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
