ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న AA23 పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తున్న తరుణంలో, తాజాగా లోకేష్ అసోసియేట్ రత్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్ట్పై హైప్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రత్నకుమార్, ఈ సినిమా కేవలం పాన్ ఇండియా లెవెల్కే పరిమితం కాదని స్పష్టం చేశారు. కథకు ఉన్న ఇంటర్నేషనల్ అప్పీల్ వల్ల ఇది నిజంగా గ్లోబల్ రేంజ్ చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నందుకు సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే అన్ని అవకాశాలూ తమకు అందుబాటులో ఉన్నాయని, బన్నీ ఇమేజ్ ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఆయన ధీమాగా చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్టైనర్ కోసం అల్లు అర్జున్తో దాదాపు మూడు వారాల పాటు స్క్రిప్ట్ చర్చలు జరిగాయని సమాచారం. పక్కా స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్న మేకర్స్ మే రెండో వారం నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టనున్నారు.
