మద్యం మత్తులో కన్ను కూతురిపైనే తండ్రి అఘాయిత్యం..

20-year-old- girl gang-rape-in-chittoor

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురు పైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు తండ్రి. మద్యం తలకెక్కితే ఏం చేస్తున్నారో ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా మందుబాబుల ప్రవర్తన జుగుప్సాకరంగా మారింది.  కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతుర్లనే మద్యం మత్తులో వారిపై చేయకూడని పనులు చేస్తున్నారు. ఏకంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఏలీయా అనే వ్యక్తికి మద్యం అలవాటు ఉంది. దీంతో ఫూటుగా మద్యం సేవించిన ఏలీయా వావి వరుసలు మర్చిపోయాడు. అతడేం చేస్తున్నాడో కూడా తనకు తెలియకుండా సభ్యసమాజం తలదించుకొనేలా వ్యవహరించాడు. ఏకంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఎవరికైనా ఈ విషయం చెప్తే చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు.

కాగా కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని తనకూతురు స్వయంగా బయటపెట్టింది. దీంతో ఏలీయాపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమె ఇలా పేర్కొన్నారు. తన తండ్రి ఏలియా తనపై చేసిన అఘాయిత్యంపై వివరించారు. దీంతో ఏలీయాను అరెస్ట్ చేసిన పోలీసులు కేసులోని మరిన్న వివరాల కోసం దర్యాప్తు సాగిస్తున్నారు.