పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను పరామర్శించేందుకు నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో పాటు అన్నా కొణిదెల ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అన్నా లెజినోవా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ప్రధాని మోదీ మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు నా జీవితంలో చిరస్మరణీయం. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు నేను ప్రామిస్ చేశాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మాటలు అభిమానుల మనసులను తాకాయి.

ఇక మరోవైపు, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా పంచుకోవడంతో, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారాయి.

