స‌మంత త‌ర్వాత అను ఇమ్మానుయేల్‌

anu emmanuel replace to Samantha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సాధార‌ణంగా ఏ భాషా ఇండ‌స్ట్రీలో అయినా హీరోయిన్లు… తొలిరోజుల్లో అవ‌కాశాల కోసం ఎన్నో ఎదురుచూపులు చూస్తారు. ఒక్కొక్క సినిమాలో న‌టిస్తూ… నెమ్మ‌ది నెమ్మ‌దిగా అటు ఇండ‌స్ట్రీలోనూ…ఇటు ప్రేక్ష‌కుల్లోనూ  గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంత‌మంది హీరోయిన్లకు మాత్రం అదృష్టం భ‌లేగా క‌లిసొస్తుంటుంది. ఒక్క సినిమాతోనే… ఇండ‌స్ట్రీ దృష్టిలో ప‌డి… ప్రిజ్టేసియ‌స్ ప్రాజెక్టుల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంటారు. టాలీవుడ్ హీరోయిన్ స‌మంత ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఏం మాయ చేశావే త‌ర్వాత ఆమె  వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేసింది. అవ‌న్నీ హిట్ట‌వ‌టంతో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోయింది. అందుకే స‌మంత‌ను అంద‌రూ ల‌క్కీగాళ్ అని పిలుస్తారు. ఇప్పుడు స‌మంతతో పాటు ఇండ‌స్ట్రీలో మ‌రో ల‌క్కీగాళ్ పేరు విన‌ప‌డుతోంది. ఆమే మ‌జ్ను ఫేం అను ఇమ్మానుయేల్ .  మ‌జ్ను త‌ర్వాత ఆమె  నా పేరు సూర్య‌, నా ఇల్లు ఇండియాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న నటిస్తోంది. వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్,  త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలోనూ చాన్స్ కొట్టేసింది అను ఇమ్మానుయేల్‌. ప్ర‌స్తుతం తార‌క్ జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. త‌ర్వాత ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జోడీగా అను ఇమ్మానుయెల్ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. న‌వంబ‌రు నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. మొత్తానికి వ‌రుస‌పెట్టి అగ్ర‌హీరోల  సినిమాల్లో చేస్తున్న అను ఈ చిత్రాల విడుద‌ల త‌ర్వాత టాప్ రేంజ్ కు వెళ్లిపోవ‌టం ఖాయ‌మంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డికి వర్మ సపోర్ట్‌

లవకుమార్‌ ప్రకటన వచ్చింది

కల నెరవేరబోతుందన్న చిరంజీవి