అసెంబ్లీ సమావేశాలు నేటితో ఆఖరు…!

AP Assembly Monsoon Session Will End Today

ఏపీ అసెంబ్లి వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ నెల 6న సమావేశాలు ప్రారంభం కాగా 7,10, 11, 17, 18 తేదీల్లో సభ జరిగింది. నేడు సమావేశాలకు చివరి రోజు కావడంతో ప్రభుత్వం సభలో 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సీపీఎస్‌ పై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. వృద్ధాప్య పింఛన్లపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు, చర్చ జరగనుంది.

ap-assemble

నదుల అనుసంధానం, సంక్షేమ రంగం, వైద్యారోగ్యం, 344 నిబంధన కింద గ్రామదర్శిని 1500 పనిదినాలు అమలుపై చర్చ జరగనున్నాయి. చంద్రన్న బీమా, ముఖ్యమంత్రి యువసేన పథకాలపై చర్చ జరగనుంది. కృష్ణానది కరకట్టల నిర్మాణం, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యశాలలో పోస్టుల భర్తీ, సూళ్లూరుపేటలో ఫెర్రీ కాల్వ దురాక్రమణ, కొండ రాజులను గిరిజన తెగగా గుర్తించడం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వ్యవసాయ భూములకు నీరు, రాష్ట్రంలో మితంవ్యయ గృహాల నిర్మాణం, ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ అమలుపై శాసనసభలో చర్చసాగనుంది.

assemble