టీడీపీకి షాక్….వైసీపీలో చేరిన మంత్రి సోదరుడు !

AP Minister Somireddy Chandramohan Reddy Brother Joins In YSRCP

గత కొన్ని రోజులుగా టీడీపీ వరస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి టీడీపీని వీడి సర్వేపల్లో వైసీపీ శాసనసభ్యుడు కాకాణి గోవర్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సుధాకర్ రెడ్డితో పాటూ మరికొందరు అనుచరులు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్థన్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని ఆ పార్టీలో చేరిన సుధాకర్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. సొంత అన్న ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తరుణంలో ఇప్పుడు ఆయన పార్టీ మారడం టీడీపీకి షాక్ అనే చెప్పాలి.

అయితే సుధాకర్ రెడ్డి పార్టీలో చేరడం శుభపరిణామని మంత్రి అవినీతి, అక్రమాలు సహించలేకే పలువురు టీడీపీని వీడుతున్నారని కాకాణి పేర్కోన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిందని వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లితో పాటూ రాష్ట్రంలో మెజార్టీ సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తాజాగా సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు సోదరుడు సుధాకర్ రెడ్డి కూడా షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న మంత్రికి రాజకీయంగా ఇబ్బంది కలిగే అంశమంటున్నారు విశ్లేషకులు మరి మంత్రి ఈ పరిణామాలు దాటుకుని ఎలా విజయం సాదిస్తారు అనేది కీలకంగా మారింది.