AP Politics: తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం..!

AP Politics: Minister Roja has a bitter experience in Tirumala..!
AP Politics: Minister Roja has a bitter experience in Tirumala..!

రోజాకి తిరుమల శ్రీవారి భక్తులు చుక్కలు చూపించారు. ఏమైందనే విషయానికి వస్తే రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఏడుకొండల స్వామి వారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుమల వెళ్లారు. ఇక్కడ దర్శనం చేసుకుని వస్తున్న రోజని భక్తులు చుట్టుముట్టారు. జై అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదాలు చేశారు. జై అమరావతి అని అనండి మేడం అని రోజుని కోరారు దీంతో రోజాకి ఏం చేయాలో తెలియని పరిస్థితి కలిగింది.

ఇక చేసేదేమీ లేక భక్తుల నినాదాలు మధ్య రోజా నవ్వుతూ వెళ్ళిపోయారు. వైసీపీ మూడు రాజధానులు అంటున్న నేపథ్యంలో జై అమరావతి అంటే టిడిపికి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఇలా అనమన్నారు. ఒకవేళ కనుక అలానే కాదు అంటే ఎన్నికల సమయంలో ప్రజల్లో వ్యతిరేకతని కొనితెచ్చుకున్నట్లు అవుతుందని అనుకున్నారేమో కానీ రోజా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇక టిడిపితో రాజకీయ ప్రస్తానని మొదలుపెట్టిన రోజా పార్టీతో విభేదాలు రావడంతో వైసీపీకి చేరారు. వైసిపి నుండి గెలిచే అసెంబ్లీలో అడుగుపెట్టి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు.