AP Politics: జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన టీడీపీ నేత..!

Election Updates: CM Jagan made a key announcement on pension hike
Election Updates: CM Jagan made a key announcement on pension hike

ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో అధికార ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆ మాటలు తూటాలు పేలుస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్ గురించి మాట్లాడారు. జగన్ మనస్తత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిది ఒక విపరీతమైన మనస్తత్వం అని ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసిన మౌనంగా ఉండడాన్ని విపరీత మనస్తత్వం అంటారని ఆయన చెప్పారు.

పత్రికలు అడిగినా ప్రతిపక్షాలు అడిగినా ప్రజాసంఘాలు అడిగినా ఎవరు అడిగినా జగన్మోహన్ రెడ్డి ఎవరికి సమాధానం చెప్పరని అన్నారు. ఎవరైనా అడిగినా కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతారని అలా మౌనంగా ఉంటే అడిగిన ప్రశ్నలకి అర్ధాంగికారం తెలిపినట్లేనా లేక ఒప్పుకున్నట్లేనా అని అన్నారు. ముఖ్యమంత్రి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నానని అన్నారు. సిబిఐ 11 ఛార్జ్ షీట్లని సిబిఐ కోర్టులో వేసిందని వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుందని వాటన్నిటినీ కోర్టు క్యాలెండర్ నెంబర్ ఇచ్చిందని అన్నారు.