మోడీ మీద అసద్ విమర్శలు…తిప్పికొట్టిన కిషన్ రెడ్డి

Asaduddin owaisi criticizes Modi kishan reddy counters

మోడీ, ట్రంప్‌ సంభాషణపై M I M హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కశ్మీర్‌ వివాదం ద్వైపాక్షిక అంశమన్న మోడీ, అమెరికా జోక్యం ఎందుకు కోరారని ప్రశ్నించారాయన. పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలాకోట్‌ దాడులు ఏకపక్షంగా చేశారని..

ఇప్పుడు అమెరికాను ఎందుకు సాయం అడుగుతున్నారని అన్నారు అసద్‌. మోడీపై అసద్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. ప్రధాని మంత్రి ఇతర దేశాధినేతలతో మాట్లాడుతారని చెప్పారాయన.

విదేశాలతో ఎలా వ్యవహరించాలో అసద్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. తాము కశ్మీర్‌ విషయంలో స్పష్టంగా ఉన్నామన్న కిషన్‌ రెడ్డి.. భారత ప్రభుత్వానికి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయన్నారు.