బాలకృష్ణకి సొంత నియోజక వర్గంలో చేదు అనుభవం

బాలకృష్ణకి సొంత నియోజక వర్గంలో చేదు అనుభవం

నందమూరి బాలకృష్ణకి మరొకసారి సొంత నియోజక వర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి టీడీపీ నేతలు, బాలయ్యతో సహా పడుతున్న సంగతి అందరికీ తెల్సిందే. రాయలసీమ లో హైకోర్టు కి వ్యతిరేకంగా బాలయ్య వున్నారని, రాయలసీమ కి బాలకృష్ణ తీరని ద్రోహం చేస్తూన్నారు అంటూ ఆ ప్రాంత స్థానికులు వ్యాఖ్యలు చేసారు. అయితే అక్కడికి చేరుకున్న బాలకృష్ణ ని ఉద్దేశించి సీమద్రోహి బాలయ్య గోబ్యాక్ అంటూ నినాదాలు చేసారు.

వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుగానే బాలయ్యని అడ్డుకొనే ప్రయత్నం చేసారు. అయితే బాలయ్యని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం తో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. జై బాలయ్య అంటూ వైసీపీ కార్యకర్తల పైకి దూసుకెళ్లారు. అయితే ఒక పక్క జై బాలయ్య అని, మరో పక్క సీమద్రోహి బాలయ్య గోబ్యాక్ అంటూ హిందూపూర్ నినాదాలతో హోరెత్తింది. రెండు రోజులు హిందూపూర్ లో పర్యటించనున్న బాలయ్యకు ఈ రెండు రోజులు సెక్యూరిటీ ని పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది.