పండక్కి అల్లుడిని పిలిచిన బాలయ్య.

Balakrishna Invited Son in Law Lokesh For Audio Launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలయ్య 102 వ సినిమా జైసింహా ఆడియో విడుదల వేడుక నేడు విజయవాడలో జరగనుంది. సిద్ధార్థ స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ వేడుక కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. జైసింహా వేడుకకి బాలయ్య ఫాన్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వుంది. 

Balakrishna Invited Son in Law Lokesh For Audio Launch
తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ , నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా ఆడియో వేడుక కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఆడియో పండక్కి ముఖ్య అతిధి ఎవరో చివరిదాకా బయటపెట్టలేదు. ఇక ఫంక్షన్ కి ముందు రోజు విషయం లీక్ అయ్యింది. బాలయ్య అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి లోకేష్ ఈ పండగలో ముఖ్య అతిధిగా మెరవబోతున్నారట. నిజానికి ఈ వేడుకకి సీఎం చంద్రబాబు వస్తారని భావించారు. కానీ ఎందువల్లనో లోకేష్ తో సరిపెడుతున్నారు.Balakrishna Invited Son in Law Lokesh For Audio Launch
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి పనిచేసిన చిరంతన్ భట్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. జైసింహాలో మొత్తం 5 పాటలున్నాయి. అనగనగా అనగనగా అందాల లోకం అనే పాటని శ్రీమణి రాయగా విజయ్ ఏసుదాస్ పాడారు. అమ్ముకుట్టి అమ్ముకుట్టి అందమంతా ఒంపకే పాటని జస్ ప్రీత్ , గీత మాధురి ఆలపించారు. జై సింహా థీమ్ సాంగ్ ని వివేక్ హరిహరన్ , ఆదిత్య అయ్యంగార్ , నోయెల్ కలిసి పాడారు. ఇక నాలుగో పాట ప్రియం జగమే ఆనందమయం ని రేవంత్, రమ్య బెహ్రా ఆలపించారు. ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తోంది అనే చివరి పాట శ్రేయ ఘోషల్ , రేవంత్ గొంతు నుంచి జాలు వారింది.