ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా విశాఖపట్నంలోని ఇన్ఓర్బిట్ మాల్లో నిర్మించిన AAA సినిమాస్ ఆగస్టు 9న ఘనంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ప్రత్యేకంగా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రానున్నారు.
అయితే, గతంలో సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కేవలం ఆహ్వానితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
అల్లు అర్జున్ కార్యక్రమం ముగిసే వరకు సాధారణ ప్రేక్షకులకు ప్రవేశం ఉండదని, ఆయన వెళ్లిన తర్వాతే మిగిలిన వారిని లోనికి అనుమతించేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఎనిమిది స్క్రీన్లతో రూపొందిన ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్లో అత్యంత భారీ ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఆగస్టు 10 నుంచి AAA సినిమాస్ సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.






