Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వార్తే. కానీ పైసావసూల్ మూవీ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఇప్పుడు బాలయ్య నేషనల్ ఫిగర్ అయిపోయారు. అమితాబ్ ఎంపీగా ఏం చేశారని ప్రశ్నించిన బాలయ్య.. నేషనల్ మీడియా దృష్టిలో పడ్డారు. అసలు బాలయ్య అంత మాట ఎందుకన్నారని నేషనల్ మీడియా తనకు తోచిన కథనాలు అల్లుకుంటోంది. మన మీడియాకు తెలిసిన నిజమేమిటంటే.. కృష్ణవంశీ డైరక్షన్లో రైతుకు కమిటైన బాలయ్య.. అందులో ఓ కీలక పాత్ర చేయడానికి అమితాబ్ ను అడిగారట. కానీ అమితాబ్ ఏమీ చెప్పలేదు. ఇంతలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీకి బిగ్ బీని అప్రోచ్ కావడం, ఆయన ఓ పాత్ర చేయడానికి అంగీకరించడం జరిగిపోయింది. ఇదే బాలయ్యకు చిర్రెత్తించింది. అందుకే అమితాబ్ కు ఇన్ డైరక్ట్ సెటైర్ వేశారని చెప్పుకుంటున్నారు. నేషనల్ మీడియా కూడా ఇదే కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ రగడపై అమితాబ్ స్పందించకపోయినా.. బాలయ్యే మరోసారి స్పందిస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సహజంగా బాలయ్య ఇలాంటివి సీరియస్ గా తీసుకోరు.. కానీ అనుకుంటే మాత్రం మీడియాకు వివరణ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: