బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునేవారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడైనప్పటికీ.. తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రెండు విడత పాదయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకోసం కష్ట పడిన వారికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అన్నారు.

వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని స్పష్టం చేశారు. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారని అన్నారు. తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరని, అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని అన్నారు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారికే టికెట్ రాలేదని గుర్తుచేశారు.