ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి, 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘రాకా’ తర్వాత ఇప్పటికే ప్రకటించిన లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ను బన్నీ పట్టాలెక్కించనున్నాడు. కొంత విరామం అనంతరం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి, 2027లోనే థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్ అనంతరం బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ ఆసక్తికరమైన సినిమా చేయనున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కడం దాదాపు ఖాయమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇలా వరుసగా ఇతర భాషలకు చెందిన దర్శకులతో ప్రాజెక్టులు లైన్లో పెట్టుకోవడంతో అల్లు అర్జున్ 2028 వరకు బిజీగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్కు చెందిన పలువురు టాప్ డైరెక్టర్లు ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనను కొంతకాలం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ మొదలైంది.
బన్నీ తన కెరీర్ను పాన్ ఇండియా స్థాయిలో మరింత విస్తరించేలా వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటుండటంతో, తెలుగు దర్శకులతో ఆయన కాంబినేషన్లు మరికొంత కాలం పట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్లానింగ్లో ఏమైనా మార్పులు వస్తాయా, లేక ఇదే లైనప్ కొనసాగుతుందా అనేది చూడాలి.






