ఓటీటీలోకి వచ్చేసిన ‘భగవంత్‌ కేసరి’..మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

ఓటీటీలోకి వచ్చేసిన ‘భగవంత్‌ కేసరి’
Cinema News

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి ఓటీటీలోకి వచ్చేసింది. కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా దసరాకు థియేటర్లలో సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక బాలయ్యకు ఈ సినిమా సూపర్ కలెక్షన్లను తీసుకొచ్చింది. థియేటర్లలో బాక్సులు కలెక్షన్స్ బద్ధలు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపేందుకు వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేసిన ‘భగవంత్‌ కేసరి’
Bhagavanth Kesari

అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో బాలయ్య యాక్షన్, డైలాగ్స్.. అనిల్ రావిపూడి టేకింగ్.. కాజల్ గ్లామర్.. శ్రీలీల నటన ప్రేక్షకులను ఫిదా చేశాయి. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలయ్య చిన్న పిల్లలకు వివరించే సీన్ ఈ సినిమాకే హైలైట్​గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక బాలయ్య- శ్రీలీల మధ్య తండ్రీ కూతుళ్ల బంధం, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్​ను ఈ సినిమా చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి మరి.