అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR

అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత తాజాగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా రెండు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇకపోతే ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ చిత్రాన్నీ అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత దర్శకుడు రాజమౌళి తీయబోయే తరువాత చిత్రం ఏంటి అనే విషయం అందరి మదిని కలచివేస్తుంది.

ఎవరితో తీస్తాడు ఎలాంటి చిత్రాన్ని తీస్తాడు అనే అనుమానాలు ఇప్పటికే అందరిలో రేకెత్తాయి…కాగా ఈ విషయానికి సంబంధించి ఒక వార్త ఇప్పుదు సామజిక మాంద్యమాల్లో బాగా ప్రచారం లో ఉంది. అయితే RRR తరువాత కూడా రాజమౌళి మళ్ళీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతన్నాడు అంటూ వార్తలు వినపడుతున్నాయి.. కానీ ఈసారి కొత్తగా ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది.. అయితే ఈ తాజా చిత్రానికి సంబంధించి విషయాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.