అమరావతి రైతులకు భరోసా ఇస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

అమరావతిరైతులకు భరోసా ఇస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే.అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ రాజధానిని మార్చెయ్యాలని మరోపక్క ఇతర ఇతర పార్టీల నేతలేమో రాజధానిని తరలించడానికి వీలు లేదని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.అయితే ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమరావతి రాజధాని రైతులకు అండగా నిలబడతామని భరోసా ఇస్తున్నారు.

దినులో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన జెఏసి మీటింగులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ మరియు దివంగత రాజశేఖర్ రెడ్డిల పై పలు సంచలన కామెంట్స్ చేసారు.వైఎస్ మరియు జగన్ లు నా హయాంలోనే పాదయాత్రలు చేసుకున్నారని ఇప్పుడు జగన్ అడ్డుకుంటున్న తీరును వ్యతిరేఖిస్తూ ఆనాడు నేను తలచుకొని ఉంటే మీరు ఏమయ్యేపోయి ఉండేవారని సంచలన కామెంట్స్ చేసారు.ముద్దులు పెట్టి జనాన్ని జగన్ మోసం చేసాడని రాజధానిగా అమరావతే ఉంటుంది అని జగన్ పై బాబు విరుచుకుపడ్డారు.